వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు ఎండిఎంకె కార్యకర్తలఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

మధురై: మరుమలర్చి ద్రావిడ మున్నేత్ర కజగమ్‌ (ఎండిఎంకె) క్రియాశీలక కార్యకర్తలను నలుగురిని మధురై పోలీసులు మంగళవారం పొటా కిందఅరెస్టు చేశారు. జూన్‌ 29వ తేదీన ఎల్‌టిటిఇ అనుకూల ప్రకటనలు చేశారనే ఆరోపణపైవీరి మీద పొటా కింద కేసు నమోదు చేశారు. పొటా కిందఅరెస్టులు జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.

ఎల్‌టిటిఇ అనుకూల ప్రకటనలు చేసిన ఎనమండుగురు ఎండిఎంకె కార్యకర్తలఅరెస్టుకు తిరుమంగళం మెజిస్ట్రేట్‌ ఎస్‌. వెంకటాచలపతి ఈ నెల 8వ తేదీన నాన్‌- బెయిలబుల్‌అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఎండిఎంకె ఎరోడ్‌ జిల్లా కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు గనేష మూర్తిని మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఆయన నివాసంలో వుండగా పోలీసులుఅరెస్టు చేశారు. మరో ఇద్దరిని మధురైలో అదుపులోకి తీసుకున్నారు. మరొకరిని శివగంగలోఅరెస్టు చేశారు.

వైగోకు వ్యతిరేకంగా పోలీసులు క్యాసెట్లను, విజువల్స్‌ను చూపించినప్పటికీ వైగోఅరెస్టుకు మెజిస్ట్రేట్‌ నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ ఇవ్వలేదు. వారెంట్‌ లేకుండా వైగోనుఅరెస్టు చేయబోమనే గ్యారంటీని పోలీసులు ఇవ్వడం లేదు. పొటా కిందఅరెస్టుకు వారెంట్‌ అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X