వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ స్కూల్లో పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం ఏర్పాటయిన వర్క్‌షాపులో ఆయన ప్రసంగిచారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పని చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

నిర్ణీత కాలవ్యవధిలో గ్రామ సచివాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, వాటి పరిపూర్ణత్వానికి చర్చలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 21 వేల 943 గ్రామ పంచాయతీలుండగా 13 వేలపైచిలుకు కార్యదర్శులు మాత్రమే నియమితులయ్యారని,మిగతా కార్యదర్శుల నియామకాలకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గ్రామ కార్యదర్శులు పని చేస్తున్న గ్రామాల్లో నివసించకపోతే వారిని వారి వారి సొంత శాఖలకు పంపిస్తామని ఆయన చెప్పారు.వివాదాల పరిష్కారానికి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేవిషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై కన్నేసి పొరపాట్లు జరిగితే క్షమించరనేవిషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X