వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలకు వార్‌ నేతలు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:పీపుల్స్‌వార్‌ ప్రతినిధులు వరవరరావు, గద్దర్‌లు కోరితే వారికి ఇద్దరేసి గన్‌మెన్‌ను ఇస్తామని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)పేర్వారం రాములు చెప్పారు. వారు చాలరంటే ముగ్గురేసి చొప్పున ఇస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకుపీపుల్స్‌వార్‌ నేత శాఖమూరి అప్పారావు వస్తే నలుగురు గన్‌మెన్‌ను ఇస్తామని ఆయన చెప్పారు. వరంగల్‌ రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆయన సోమవారంవిలేకరులతో మాట్లాడారు.

పీపుల్స్‌వార్‌ ప్రతినిధుల బాధ్యత నుంచి వైదొలిగిన వరవరరావు, గద్దర్‌ తమకు పోలీసుల నుంచి ప్రాణభయం వుందంటూ చేసిన ప్రకటనపై స్పందిస్తూ వారు కోరితే పోలీసు రక్షణ కల్పిస్తామని రాములు అన్నారు. వారిద్దరు నాకు బాగా తెలుసు. వరవరరావుతో బిఎల్‌ చదువుతున్న నాటి నుంచి పరిచయం ఉంది. నిస్సంకోచంగా ఫోన్‌ చేస్తే వారికి గన్‌మెన్‌ను ఇస్తాం అని ఆయన అన్నారు. మాజీ నక్సలైట్లను, లొంగిపోయినమిలిటెంట్లను లాడ్జీల్లో పెట్టి పోలీసులు వేధిస్తున్నారని వార్‌ ప్రతినిధులు చేసిన ఆరోపణలనువిలేకరులు ప్రస్తావించగా ఆ వివరాలు ఇవ్వాలని కోరినా ఇంత వరకు వారు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లపై ప్రతిస్పందిస్తూ అవి నిజమైన ఎన్‌కౌంటర్లని, ఇళ్లలో ఉన్నవారిని తెచ్చి కాల్చలేదని ఆయన అన్నారు. ఇద్దరు మంత్రులను ప్రభుత్వం నియమించిన తర్వాత కూడా కోర్టు వాయిదాల్లా చర్చల వాయిదాలేమిటని ఆయన అడిగారు. ఈ లోపలవిలువైన ప్రాణాలు పోతున్నాయని ఆయన ఎన్‌కౌంటర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X