వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి అమెరికా పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన చేసే అవకాశాలున్నాయి. అమెరికాలోసెప్టెంబర్‌ 11వ తేదీ తీవ్రవాదుల దాడి వార్షిక కార్యక్రమం సందర్భంగా వాజ్‌పేయి ఈ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా జనరల్‌అసెంబ్లీనుద్దేశించి సెప్టెంబర్‌ 13వ తేదీన ప్రసంగిస్తారు. అధ్యక్షుడు జార్జి బుష్‌తో విస్తృతస్థాయి చర్చలు జరుపుతారు.

అయితే వాజ్‌పేయి అమెరికా పర్యటన ఇంకా ఖరారు కాలేదు. కానీ ఆయనసెప్టెంబర్‌ 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించే అవకాశాలున్నాయి. భారత సంతతికి చెందినవారి గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ తృతీయ గ్లోబల్‌ ఇండియన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కాన్ఫరెన్స్‌లో వాజ్‌పేయి ప్రసంగిస్తారు. జనరల్‌అసెంబ్లీకి హాజరయ్యే ప్రపంచ నేతలతో ఆయన వరుసగా చర్చలు జరిపే అవకాశాలున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X