వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓ ఇంటివారైనరోజా-సెల్వమణి
తిరుపతిః తమిళ దర్శకుడుసెల్వమణితో అందాలనటి రోజా వివాహం బుధవారం వేకువజామున తిరుపతిలోఅంగరంగ వైభవంగా జరిగింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రే తిరుమలకు చేరుకున్న చంద్రబాబు నాయుడు రోజా-సెల్వమణి దంపతులనుఆశ్వీర్వదించారు. ఐ.టి.మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తదితరులు కూడా ఈవివాహానికి హాజరయ్యారు. తెలుగులో హీరోయిన్ గా రంగప్రవేశంచేసిన రోజా ఆ తరువాత తమిళ చిత్రాల్లో కూడా బిజీగా మారారు. రోజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రాలకు దర్శకత్వం వహించినసెల్వమణితో ఆమె ప్రేమలో పడ్డారు.
Story first published: Wednesday, August 21, 2002, 23:53 [IST]