వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయ ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్ః తమ నాయకురాలు సోనియా గాంధిపై అడ్డంగా ఆరోపణలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఆంధ్రకాంగ్రెస్ రణభేరి మోగించింది. హైదరాబాద్-మేడ్చల్ జాతీయ రహదారిపై కొంపల్లి వద్ద వున్న జయలలితకు చెందిన ఫాం హౌస్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఆ తరువాత జయలలిత ఫోటోలను దగ్ధం చేశారు. సోనియా గాంధీ వంటి జాతీయ నేతను తప్పుపట్టే హక్కు జయలలితకు లేదని యూత్ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
Comments
Story first published: Tuesday, September 3, 2002, 23:53 [IST]