వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ ఫాంహౌస్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తమ నాయకురాలు సోనియా గాంధిపై అడ్డంగా ఆరోపణలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఆంధ్రకాంగ్రెస్‌ రణభేరి మోగించింది. హైదరాబాద్‌-మేడ్చల్‌ జాతీయ రహదారిపై కొంపల్లి వద్ద వున్న జయలలితకు చెందిన ఫాం హౌస్‌ వద్ద యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఆ తరువాత జయలలిత ఫోటోలను దగ్ధం చేశారు. సోనియా గాంధీ వంటి జాతీయ నేతను తప్పుపట్టే హక్కు జయలలితకు లేదని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నినాదాలు చేశారు.

కావేరీ జలాలవివాదం గురించి మాట్లాడుతూ హఠాత్తుగా తమ నేత సోనియాపై జయవిమర్శలు చేయడం వెనుక భారతీయ జనతాపార్టీ హస్తం వున్నదని కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. సోనియా గాంధీపైవిమర్శలు కొనసాగిస్తే లక్షలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని యూత్‌ కాంగ్రెస్‌ నేత సుధాకర్‌ రెడ్డి సారధ్యంలోని కార్యకర్తలు హెచ్చరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X