వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో 12 మంది హత్య- గ్రిడ్‌పై దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: కతువా జిల్లా హీరానగర్‌ ప్రాంతంలో వెళ్తున్న వాహనాలపైమిలిటెంట్లు కాల్పులు జరపడంతో మంగళవారం ఉదయం 12 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో మూడో దశ పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలోమిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు.

మిలటరీ యూనిఫారాలు ధరించిన ముగ్గురుమిలిటెంట్లు మెటాడోర్‌ వ్యాన్‌లో సరిహద్దు నుంచి వచ్చి వాహనాలపై కాల్పులు జరిపారని సమాచారం. మొదట ఆ ప్రయివేట్‌ బస్సుపై గ్రెనేడ్‌విసిరారని, ఆ తర్వాత స్టెన్‌గన్‌లతో కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షుల కథనం.

కతువా జిల్లాలోని హీరానగర్‌లోని పవర్‌ గ్రిడ్‌స్టేషన్‌పై కూడా మిలిటెంట్లు దాడి చేశారు. ఆత్మాహుతి దళ సభ్యులుగా భావిస్తున్నవారు మంగళవారం ఉదయం గం.6.45 నిమిషాలకు ఈ దాడి జరిపారు. ప్రాణ నష్టం సంభవించిన సమాచారమేదీ ఇప్పటి వరకు లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X