వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లబెల్లం రైతుల ఆందోళన ఉధృతం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నల్లబెల్లం రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. నల్లబెల్లంపై నిషేధం ఎత్తివేయాలని తాము ఎంతగా నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు.

ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అఖిలపక్ష కమిటీ అధ్వర్యంలో విశాఖపట్నం కలెక్టరేట్‌ వద్ద శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల నేతల అధ్వర్యంలో రైతులు సమావేశమయ్యి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు రైతులతో కలిసి హైదరాబాద్‌ లో రౌండ్‌ టేబులు చర్చలు జరిపాక తమ కార్యచరణ ప్రణాళికను తెలియచేస్తామని రైతుల తరఫున ఆందోలన నిర్వహిస్తోన్న కాంగ్రెస్‌ నేతలు విలేకరులకు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X