వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం కార్యకలాపాల్లో పారదర్శకత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పార్టీ కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికల నిర్వహణ కమిటీ ఆదివారంనాడిక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సభ్యత్వ నమోదు, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పాటించనున్నట్లు, కార్యకలాపాలు అందరికీ తెలిసేలా నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. తమ కమిటీని రెండు భాగాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒకటి సంస్థాగత ఎన్నికల నిర్వహణ చేపడుతుందని, రెండోది జిల్లా, డివిజన్‌, మండల స్థాయి కమిటీల వ్యవహారాలు చేస్తుందని ఆయన చెప్పారు. మహానాడు నాటికి రాష్ట్ర స్థాయి కమిటీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ లోగా జిల్లా మినిమహానాడులు జరుగుతాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X