ఇక రాష్ట్రంలో పాతవాహనాల నిషేధం
అహ్మదాబాద్: గుజరాత్ లో వచ్చే నెల ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జె.ఎం.లింగ్డో సోమవారం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ఆయన రెండు రోజుల పాటు పర్యటిస్తారు. సోమవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న లింగ్డో, తన సహచర కమీషననర్ లు టి.ఎస్.కృష్ణమూర్తి, బి.బి.టాండన్లతో సమావేశమయ్యారు.
వారు ముగ్గురు ఇక్కడి సమస్యత్మక ప్రాంతాలను సందర్శించి పరిస్థితినిఅంచనావేస్తారు. వివిధ రాజకీయ పార్టీలతోనూ, అధికారలతోనూ వారు సమావేశమవుతారు.
తరుచుగా మతకల్లోహాలు చెలరేగుతున్న ప్రాంతాలపై కమిషనర్లు అధిక దృష్టిని సారిస్తున్నారు. కాశ్మీర్ ఎన్నికల మాదిరిగా గుజరాత్ లో నిష్పాక్షిపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, గుజరాత్ అపధ్దర్మ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గోద్రా ప్రాంతంలో తన గౌరవయాత్రను సోమవారం చేపట్టారు.