వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీడీపీ నేత థియేటర్ పేల్చివేత
హైదరాబాద్: కర్నూల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలోని ఓ థియేటర్ ను పీపుల్స్ వార్ గ్రూప్ కు చెందిన నక్సలైట్లు పేల్చివేశారు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. థియేటర్ పాక్షికంగా ధ్వంసమైంది. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.
ఈ థియేటర్ టీడీపీ మండల యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందినది. మహానంది దళానికి చెందిన ఆరుగురు నక్సలైట్లు థియేటర్ లోకి చొరబడి బాంబులు పెట్టి థియేటర్ ను పేల్చివేశారని పోలీసులు తెలిపారు. సినిమా థియేటర్ ప్రోజెక్షన్ రూం పూర్తిగా నాశనం కాగా, మిగతా భాగం పాక్షికంగా ధ్వంసమైంది.
Story first published: Saturday, January 18, 2003, 23:53 [IST]