ధార్ జిల్లాలో కర్ఫ్యూ కొనసాగింపు
ధర్:
ధర్
జిల్లాలోని
మూడు
పట్టణాల్లో
కర్ఫ్యూ
కొనసాగుతోంది.
సంఘ్
పరివార్కు
చెందిన
సంస్థ
బుధవారం
నిర్వహించిన
బంద్
సందర్భంగా
హింస
చెలరేగడంతో
ఈ
పట్టణాల్లో
కర్ఫ్యూ
విధించారు.
భోజశాల- కమల్మౌలా మసీదును తెరవాలని డిమాండ్ చేసిన హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలపై జిల్లా యంత్రాంగం మంగళవారం దౌర్జన్యం జరిపిందంటూ అందుకు నిరసనగా హిందూ మత సంస్థలు బుధవారం బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ సందర్భంగా ధార్ నగరంలో కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు.
దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింసాకాండలో 15 మంది పోలీసులతో సహా 25 మంది గాయపడ్డారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నందున కర్ఫ్యూను సడలించే ప్రసక్తి లేదని ధార్ కలెక్టర్ సంజయ్ దూబే చెప్పారు. అయితే పరిస్థితి అదుపులోనే వున్నదని ఆయన చెప్పారు. ధార్ పట్టణంలో ఒక కంపెనీ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.