లత విమర్శలపై షబానా మౌనం!
లండన్: రాజ్యసభకు గైర్హాజరీపై భారతరత్న లతామంగేష్కర్, నటి షబానా ఆజ్మీల మధ్య కొనసాగుతోన్నవివాదానికి తెరపడింది. వీరు ఇరువురు రాజ్యసభ సభ్యులు. లతా పార్లమెంట్ సమావేశాలకుగైర్హాజరు కావడంపై ఇటీవల షబానా ఆజ్మీ తీవ్రంగావిమర్శలు చేశారు.
అయితే, లతా మంగేష్కర్ కూడా తీవ్రంగా స్పందిస్తూ మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై షబానా వ్యాఖ్యానించేందుకు ఇప్పుడు వెనుకాడుతున్నారు. లండన్ పర్యటనలో ఉన్న షబానా శుక్రవారంవిలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అక్కడితో ఆపేద్దాం. దాన్ని మరింతగా పొడిగించి కొత్తవివాదానికి తెరతీయడం ఎందుకు? అనిప్రశ్నించారు.
అయితే, తాను లతాపై చేసినవిమర్శలు ఆమెపై గౌరవంతో చేసినవేనని షబానా స్పష్టం చేశారు. ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదనిపేర్కొన్నారు. మరిన్ని ప్రశ్నలు సంధించిన విలేకరుల నుంచి ఆమె తప్పించుకున్నారు.ఒకే. మీకు అడిగే హక్కు ఉంది. అలాగే సమాధానం ఇవ్వకపోయే కూడా నాకు ఉంది. కాబట్టి ఈవిషయాన్ని ఇక్కడే ముగిద్దాం. దయచేసి పొడిగించొద్దుని ఆమెవిలేకరులను కోరారు. శనివారం రాత్రికి ఆమె తిరిగి ఇండియాకువస్తున్నారు.