హైదరాబాద్లో బిజెపి జాతీయ సమావేశాలు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ సమావేశాలు ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్లో జరుగనున్నాయి. బిజెపి శాసనసభా పక్షం నాయకుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి మంగళవారంవిలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు.
ఈ సమావేశాలను ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ ఈ నెల 29వ తేదీన ప్రారంభిస్తారు. బిజెపి జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడితో పాటు పలువురు సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమవేశంలో పాల్గొంటారు. ఈ ఏడాది చివరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇదే సమయంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ 300సీట్లు గెల్చుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ఈ సందర్భంగా ఎన్నికల కోసం పని చేసే పది వేల మంది కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై తాము జాతీయ నాయకుల సూచనలు తీసుకుంటామని ఇంద్రసేనా రెడ్డి చెప్పారు.