సమ్మతి వుంటే దేశంతో చెలిమి: నాయుడు
హైదరాబాద్: ఇరు పార్టీల సమ్మతి వున్నంత వరకు రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. పార్టీ జాతీయ సమావేశాల సందర్భంగా ఆయన శుక్రవారంవిలేకరులతో మాట్లాడారు.
పొత్తు వల్ల రెండు పార్టీలు లాభపడ్డాయని, పొత్తు వల్ల ఉపయోగం లేదని తెలుగుదేశం, బిజెపిల్లో ఏ పార్టీ అనుకున్నాస్నేహం తెగిపోతుందని, బిజెపి మాత్రం పొత్తు వల్ల తమకు ఉపయోగం లేదని అనుకోవడం లేదని ఆయనవివరించారు.
ఈ ఏడాది చివరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల కోసం సమావేశం రూపొందించిన 25 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. తమ మిత్రపక్షాలకు సమ్మతమైనంత వరకు ఆ పక్షాలతో బిజెపిస్నేహం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. శక్తివంతమైన భారత నిర్మాణం కోసం బిజెపిని గెలిపించాలని ప్రజలకువిజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.