వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుట్రలో వాజ్‌పేయి, అద్వానీ: కళ్యాణ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: భారతీయ జనతా పార్టీ (బిజెపి), రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఘ్‌ ప్రముఖ నాయకుల ఆదేశాల మేరకే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ ఆరోపించారు. అయోధ్యలోనివివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన సమయంలో ఆయన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

వివాదాస్పద కట్టడం కూల్చివేత కుట్రలో ప్రస్తుత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ, కేంద్ర మంత్రి మురళీ మనోహర్‌ జోషీ,సీనియర్‌ సంగ్‌ పరివార్‌ నేతలు పాలు పంచుకున్నారని ఆయన అన్నారు. మసీదును కాపాడడంలో 1992లో తన ప్రభుత్వంవిఫలమైందని కేంద్రం గురువారం ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు.

సీనియర్‌ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను రక్షించే కుట్రలో భాగంగానే మసీదు రక్షించడంలో తన ప్రభుత్వం, కేంద్రంలోనిపి.వి. నరసింహారావు ప్రభుత్వం విఫలమయ్యాయంటూ బిజెపి న్యాయవాది లాలా రామ్‌ గుప్తా లిబర్హాన్‌ కమీషన్‌ ముందు తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేశారని ఆయనవిమర్శించారు. తన ప్రభుత్వం గానీ, పివి ప్రభుత్వం గానీ మసీదు కూల్చివేతకు కారణం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X