వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎ పెంపు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2.5 శాతంపెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన డి.ఎ ఈ ఏడాది జనవరి ఒకటినుంచే అమల్లోకి వస్తుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకుదాదాపు 170 కోట్ల అదనపు భారం పడనుంది. ఎయిడెడ్, కళాశాల అధ్యాపకులకు మాత్రం మూడు శాతండి.ఎను పెంచనున్నారు.
ఈ నిర్ణయంతో పాటు గోదావరిబేసిన్ లోని గ్యాస్ లభ్యతపై ఏర్పాటైనఎల్.శంకరన్ కమిటీ సిఫార్సులనూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జన్మభూమి, కోటి వరాల అమలు, పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలపైనా క్యాబినెట్ చర్చించినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరలుకు తెలిపారు.
Story first published: Monday, June 23, 2003, 23:53 [IST]