కాంగ్రెస్ రాష్ట్రాల కన్నా మేమే ముందు
హైదరాబాద్: అభివృద్ధిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశే ముందంజలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావాలంటే దీనిపై బహిరంగ చర్చకూ సిద్దమేనని ఆయన సవాల్విసిరారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి రాజకీయ జిత్తులు వేస్తోన్న, తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలుగుదేశం పార్టీ కార్యవర్గ విస్తృత స్ధాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర కార్యవర్గంలోకి కొత్తగా చేర్చుకున్న సభ్యులతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రాష్ట్ర కార్యవర్గంతోనే ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని, ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయనకోరారు.
ప్రజా సంక్షేమమే ప్రధమ కర్తవ్యంగా పరిగణిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం తధ్యమని చంద్రబాబు నాయుడుఅన్నారు. శుక్రవారం కూడా జరుగనున్న పార్టీ కార్యవర్గ విస్తృత స్ధాయి సమావేశంలో 610జీవో అమలు తదితరఅంశాలు చర్చిస్తారు.