డ్రామా అనంతరం శైలజ అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన ఓ ఫైనాన్సియర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన శైలజను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా కాసేపు ఆమె స్పృహ తప్పిపోయినట్లుగా డ్రామా కూడా ఆడింది. ప్రభాకర్ దగ్గర్నుంచి అప్పుగా డబ్బులు తీసుకున్న శైలజ అది తీర్చే ఉద్దేశం లేక ప్రభాకర్ ను కిరాతకంగా కడతేర్చిందని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం ప్రభాకర్ అదృశ్యంతో రంగంలోకి దిగిన పోలీసులకు ముక్కలు ముక్కలుగా కోసిన అతని శవం శైలజకు ఉంటోన్న భాను టవర్స్ లో దొరికింది. అనుమానంతో శైలజను అదుపులోకి తీసుకొని నాలుగు రోజులుగా ఆమెను ప్రశ్నించిన అనంతరం ఆమె హత్య చేసిందని రుజువుకావడంతో శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు. భర్త సింగపూర్ కు వెళ్ళేందుకు అప్పులు చేసిన శైలజ, వాటిని తీర్చేందుకు ప్రభాకర్ తో పరిచయం ఏర్పరుచుకొంది. అయితే, మగాళ్లపై ద్వేషం వల్లే తాను ఈ పనికి ఒడిగట్టినట్టు ఆమె విలేకరులకు తెలిపింది. మగవాళ్లు అందరూ అంతే. సహాయానికి వెళితే, సెక్స్ కోసం ఆశిస్తారు. అది లేకుండా సాయం చేయరు. అందుకే నాకు మగవాళ్ళపై ద్వేషం పెరిగిందని ఆమె వివరించింది.