For Daily Alerts
బస్సు లోహలో పడి 16 మంది మృతి
జమ్మూ: జమ్మూకాశ్మీర్ లోని దోడా జిల్లాల్లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
దోడా జిల్లా ప్రేమనగర్ గ్రామం వద్ద ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. దోడా నుంచి కిస్తావర్ వెళ్తోన్న బస్సు ప్రేమనగర్ వద్ద డ్రైవర్ అదుపుతప్పి లోహలో పడింది. బురద కారణంగా బస్సు స్లిప్అయిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం వెంటనే ఘటనాస్థలికి చేరుకొంది. క్షతగాత్రులను సమీప ఆసుప్రతిలో చేర్పించారు.
మృతదేహాలను లోహ నుంచి బయటికి తీశారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.
Story first published: Sunday, July 13, 2003, 23:53 [IST]