ప్రైవేటీకరణ: కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు హిందూస్థాన్పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్), భారత్పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)ల ప్రైవేటీకరణ ప్రతిపాదనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హెచ్పిసిఎల్, బిపిసిఎల్ల యాజమాన్యాలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆయిల్ సెక్టార్ ఆఫీసర్ల సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై ఛీఫ్ జస్టిస్వి.యన్. ఖారే, జస్టిస్ ఎస్.బి. సిన్హాలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ నోటీసులు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ రెండు ఆయిల్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చట్టవిరుద్ధమని, పెట్టుబడుల ఉపసంహరణకు పార్లమెంట్లో చట్టం తేవాల్సి ఉంటుందని పిటిషనర్,సీనియర్ న్యాయవాది ఎఫ్.ఎస్. నారిమాన్ వాదించారు.