For Daily Alerts
టీడీపీతో స్నేహం ఉంటుంది : వెంకయ్య
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో పొత్తు కుదుర్చుకుంటామని బీజేపీజాతీయ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయనవిలేకరులతో మాట్లాడుతూ..టీడీపీతో పాటు ఇతర మిత్రపక్షాలన్నింటితోనూస్నేహసంబంధాలు కొనసాగుతాయని తెలిపారు.
మనస్పర్థలు ఏవీ లేవన్నారు. ఇంద్రాసేనారెడ్డి కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడారు. వామపక్షాలు టీడీపీతో పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలకు స్పందిస్తూ..వామపక్షాలు కాంగ్రెస్ తో చేతులు కలిపే అవకాశం ఉందన్నారు. టీడీపీతో తమ పొత్తు వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పారు. అయోధ్యపైవిపక్షాలు చేస్తోన్న వివాదం అర్ధరహితమని ఆయన అభివర్ణించారు.
Story first published: Sunday, August 3, 2003, 23:53 [IST]