డి.శ్రీనివాస్ కొత్త పీసీసీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ, హైదరాబాద్:అంతా అనుకున్నట్లే జరిగింది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందినసీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డి.శ్రీనివాస్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.
శుక్రవారం తనపీసీసీ పదవికి ఎమ్మెస్సార్ రాజీనామా చేసిన వెంటనే ఏఐసిసి కొత్తపీసీసీ నేత ఎన్నికను చేపట్టింది. శుక్రవారం ఉదయంఅంతా పి.శివశంకర్ పేరు వినిపించినప్పటికీ మధ్యాహ్నానికిసీన్ మారింది.
సీఎల్పీ అధ్యక్షుడు వై.ఎస్సార్ కు అత్యంత సన్నిహితుడిగాపేరొందిన శ్రీనివాస్ ఎంపిక కొద్దిరోజులుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ గతంలో రెండు సార్లు మంత్రి పదవులను కూడాచేపట్టారు.
ప్రత్యేక తెలంగాణ వాదులను సంతృప్తి పరిచేందుకే శ్రీనివాస్ వైపు ఎఐసిసి మొగ్గుచూపింది. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతోన్న శ్రీనివాస్ వెనుకబడిన వర్గాలకు చెందినవాడు కావడం కూడా ఆయనకు అనుకూలించినఅంశం.