వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. చిత్తూరు- కడప సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయచోటికి చెందిన ఐదుగురు మరణించారు.

తమిళనాడులో మేరీమాతను దర్శనం చేసుకుని కడపకు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టాటా సుమో చెట్టుకు ఢీకొట్టింది. మరణించినవారిలో ఫొటోగ్రాఫర్‌ సుబ్బారాయుడు, ఆయన భార్య, కుమారుడు ఉన్నారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లా కొత్త కోట వద్ద వ్యాను లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. రెండు వాహనాల డ్రైవర్లు, లారీ క్లీనర్‌ ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన వెటర్నరీ డాక్టర్‌ జగదీశ్వర రెడ్డి కూడా మృతి చెందాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X