For Daily Alerts
టీచర్ల అంతర్జిల్లా బదిలీలు: మంత్రి
హైదరాబాద్: ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో, అఖిల పక్ష నాయకులతో చర్చించిన అనంతరం ప్రాథమికవిద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రభత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.
610 జివో పరిమితులకు లోబడి ఈ బదిలీలు జరుగుతాయని ఆయన చెప్పారు. జిల్లాల్లో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అంతర్జిల్లా బదిలీలను అమలుచేస్తామని కూడా ఆయన చెప్పారు. సెలవులను, విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. చదువుల పండుగ కార్యక్రమాన్ని వచ్చే నెల 13వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Monday, September 29, 2003, 23:53 [IST]