వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణానీటిపై కాంగ్రెస్కు శ్రీహరి ప్రశ్నలు
హైదరాబాద్: కృష్ణా జలాలపై మంగళవారం కూడా శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరంవిమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు.
కృష్ణా జలాలపై కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరివిమర్శించారు. జాతీయ పార్టీగా కృష్ణా జలాలపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాలపై తమకు స్పష్టమైన అవగాహన ఉన్నదని, కాంగ్రెస్కే లేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ భిన్న వైఖరులను అవలంభిస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వంవిఫలం కావడం వల్లనే సమస్య ఉత్పన్నమైందని ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డివిమర్శించారు.
Story first published: Tuesday, September 30, 2003, 23:53 [IST]