For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లా దామచర్ల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను మిర్యాలగుడా ఆస్పత్రిలో చేర్చారు.
తెనాలి నుంచి హైదరాబాద్ క్వాలీస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇద్దరు హైదరాబాద్లోని ఉప్పల్కు చెందినవారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.క్వాలిస్లో ప్రయాణిస్తున్న భాస్కర రెడ్డి, మల్లికార్జున్, సుభానీ, డ్రైవర్ నర్సింహ మరణించినట్లు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
Story first published: Sunday, October 12, 2003, 23:53 [IST]