తిరుమల చుట్టూ పోలీసు వలయం
తిరుమల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనను పురస్కరించుకుని తిరుమల పోలీసు వలయంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలిపిరి వద్ద ఈ నెల 1వ తేదీన నక్సలైట్ల దాడి నుంచి బయట పడిన చంద్రబాబు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం గురువారం ఇక్కడికి వస్తున్నారు.
చంద్రబాబు తిరుమలకు తనపై దాడి జరిగిన రెండో ఘాట్ రోడ్డుమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల, తిరుపతి ప్రాంతాలను పోలీసులు తమస్వాధీనంలోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటిండెంట్గా బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన రామచంద్రరాజు ముఖ్యమంత్రి పర్యటన కోసం తీసుకున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలీసు యంత్రాంగానికి తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రిపై దాడికి నక్సలైట్లు మళ్లీ మందుపాతరపేల్చకపోవచ్చునని, అయితే ఇతర పద్ధతుల్లో దాడి ప్రమాదం లేకపోలేదని ఆయన అన్నారు. పోలీసులు విధులనువిస్మరిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.
తమ నేత తిరుమల పర్యటన సందర్భంగా తెలుగుదేశం నేతలు సమాలోచనలు జరిపారు. పోలీసులకు సహకరిస్తూ తమ నేతకుస్వాగతం చెప్పాలని వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి గురువారం తిరుమల చేరుకుని ఆ రోజు అక్కడే బస చేసి మర్నాడుస్వామివారిని దర్శించుకుంటారు.