వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింగరేణిలో పూర్తి భద్రత: కొత్తపల్లి
కరీంనగర్: సింగరేణి గనుల్లో భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్రవిద్చుచ్ఛక్తి శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. సింగరేణి గని కూలి పది మంది మృతి చెందిన నేపథ్యంలో ఆయన అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రాణ నష్టాలను నివారించడానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలైన ఖర్చు చేసి భద్రతా ఏర్పాట్లు చేస్తుందని ఆయన శనివారం చెప్పారు. భవిష్యత్తులో ప్రాన నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు భోజన, తదితర సౌకర్యాలను కూడా ఆయన దగ్గరుండి చేయిస్తున్నారు. తాత్కాలిక వైద్య బృందాన్ని అక్కడ నియోగించారు.
Story first published: Saturday, October 18, 2003, 23:53 [IST]