బాంబు పేలి 25 మందికి గాయాలు

Posted on 21-11-03

ముంబాయి: మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతంలో గల పర్భాని మసీదులోకి దుండగులు బాంబులువిసిరారు. ఈ బాంబు పేలడంతో 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన మొహమదియా మసీదులో శుక్రవారంనాడు మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో నమాజు చేస్తుండగా జరిగింది.

దుండగులు మోటార్‌ సైకిళ్లపేఐ వచ్చి రెండు నాటు బాంబులను మసీదులోకి విసిరారని ఉప ముఖ్యమంత్రి ఛగన్‌ భుజబల్‌ విలేకరులతో చెప్పారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో కర్ఫ్యూ విధించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రమంతటినీ అప్రమత్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+