జెపిసి విచారణకు కాంగ్రెస్ డిమాండ్
Posted on 21-11-03
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆరుగురు మంత్రులు డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలపై, మాజీ మంత్రి దిలీప్ సింగ్జుదేవ్ లంచం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్నుకోరారు.
కాంగ్రెస్ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రపతిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. జుదేవ్ కేసు విషయంలో ఇప్పటి వరకు అనుసరించిన వైఖరి పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పైస్థాయిలో అవినీతిని ప్రభుత్వం పట్టించుకునే ఉద్దేశ్యంతో లేదని వారన్నారు.












Click it and Unblock the Notifications
