For Daily Alerts
బాలల చిత్రాల శైలి మార్పు: రవీనా ముంబై: సందేశాత్మక చిత్రాల కన్నా విజ్ఞానదాయకమైన వినోదాత్మక చిత్రాలనే ఇక నుంచి నిర్మిస్తామని బాలల చలనచిత్రాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు రవీనాటాండన్ తెలిపారు. పిల్లలకు బోర్ కొట్టేవిధంగా ప్రస్తుతం చిత్రాలు రూపొందిస్తున్నారని, వాటి పద్దతిని ఇక సమూలంగా మారుస్తామని ఆమె పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రభుత్వ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి నిజాం వైద్యవిద్యసంస్థ (నిమ్స్)ను న్యూఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రి స్థాయిలో అభివృద్ధిపరుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఇందుకోసం వెంటనే 100 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నామని ఆమె చెప్పారు. దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక ఆసుపత్రిని ఏయిమ్స్ స్థాయికి విస్తరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని ఆమె వివరించారు.
Story first published: Sunday, January 11, 2004, 23:53 [IST]