For Daily Alerts
కాంగ్రెస్తో పొత్తుకు దిగిరాం: కెసిఆర్హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంలో మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం అనంతరం చంద్రశేఖర్ రావువిలేకరులతో మాట్లాడారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోవిపక్షాలను ఏకం చేస్తామని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలుగుదేశం- బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నాలు చేస్తామని ఆయన సోమవారంవిలేకరులతో చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటే రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. సోనియాగాందీ విదేశీయతను లేవనెత్తడం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోనియా విదేశీయత గురించి మాట్లాడడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు. చంద్రబాబునాయుడు అభివృద్ధిఅంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని, నిరుద్యోగంపెచ్చరిల్లిందని ఆయన అన్నారు.
Story first published: Monday, January 12, 2004, 23:53 [IST]