విసిపై దాడి: అసెంబ్లీలోదుమారం
నక్సల్స్తోఏ ప్రాతిపదికపై చర్యలు జరపాలనేవిషయంలో, ఎవరితో చర్చలు జరపాలనేవిషయంలో ప్రభుత్వం స్పష్టమైనవైఖరితో ఉండాలని ఆయన అన్నారు.చర్చలకు సానుకూల వాతావరణంఏర్పడడానికి ఇరు వైపులా హింసఆగిపోవాలని, ప్రభుత్వం గాలింపు చర్యలుమానేయాలని ఆయన అన్నారు. చర్చలవిషయంలో రెండు వర్గాలు కూడాస్పష్టంగా వున్నట్లు కనిపించడంలేదని ఆయన అన్నారు. నక్సల్స్డిమాండ్లు ఏమిటనేది కూడా స్పష్టంచేయాలని ఆయన అన్నారు.చర్చలకోసం నక్సల్స్ కాల్పులు ఆపేయడంతోపాటు ఆయుధాలను వదిలిపెట్టాలని ఆయనఅన్నారు. నక్సల్స్తో చర్చల విషయంలోగిరిగీసుకుని ఉండడం సరి కాదని ఆయనఅన్నారు.రాష్ట్రప్రభుత్వానికి, నక్సల్స్కు మధ్యచర్చలు జరగాలనేదే తమ వైఖరి అనిసిపియం శాసనసభా పక్షంనాయకుడు నోముల నరసింహయ్యఅన్నారు. నక్సల్స్ సమస్య రాజకీయ,సామాజిక, ఆర్థిక సమస్య అని ఆయనఅన్నారు. పోలీసులు రెచ్చగొట్టే ధోరణిమానుకోవాలని ఆయన సూచించారు.