వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఘీలపై చర్య తీసుకోవాలి: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాలకార్మికులనుఉద్యోగాల్లో పెట్టుకున్న సంఘీ గ్రూపు సంస్ధలపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. సంఘీగ్రూపు సంస్ధల్లో వేలాదిబాలకార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తోందని చట్టాలు, కార్మికమంత్రి ఏం చేస్తున్నారని ఆయన శనివారం ఇక్కడ ప్రశ్నించారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన సంఘీ గ్రూపు బాలకార్మికులనుఆయన నిమ్స్‌లో పరామర్శించారు.

ప్రతిపక్షంలోకి వచ్చినతర్వాత చంద్రబాబు నాయుడు ఒక అంశంపై ప్రభుత్వంపై ఇంతగావిరుచుకుపడడం ఇదే ప్రధమం. సంఘీ సంస్ధలపై కేసులునమోదు చేసి యజమానులను అరెస్టు చేయాలని ఆయనడిమాండ్‌ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడుబాలకార్మికులతో పనిచేయించుకునే వారిపై కఠిన చర్యలుతీసుకున్నామని ఆయన చెప్పారు. బాలకార్మికులను సంఘీఫ్యాక్టరీకి తీసుకెళ్తున్న బస్సు ప్రమాదంలో ఒక బాలిక మృతిచెందగా యాభై మందికి పైగా గాయపడ్డారని, ఓవర్‌లోడుతో వెళ్తున్నందున ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. ఈసంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా సంఘీ యాజమాన్యంపైఎందుకు చర్య తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X