ఒకే రోజు లక్షఎకరాల భూమి పంపిణీ: ధర్మాన
హైదరాబాద్:బలహీన వర్గాలకు ఒకే రోజు లక్ష ఎకరాలమిగులు భూమిని పంపిణీ చేయనున్నట్లురాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రిధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈభూ పంపిణీ వచ్చే ఏడాది జనవరిలోజరుగుతుందని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలోచెప్పారు.
పంపిణీచేసే భూమిలో సగం ఎస్సి, ఎస్టిలకుఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.నియోజకవర్గాల వారీగా శాసనసభ్యుడుచైర్మన్గా అసైన్ కమిటీలు వేస్తామనిఆయన చెప్పారు. ఈ కమిటీలు లబ్ధిదారులనుగుర్తిస్తాయని ఆయన చెప్పారు. మిగులభూముల సేకరణ ఇప్పటికేప్రారంభమైందని ఆయన చెప్పారు. అసైన్ భూములనుఅనర్హుల నుంచి స్వాధీనం చేసుకునిఅర్హులైనవారికి తిరిగి ఇస్తామని ఆయనచెప్పారు. బలహీన వర్గాలకు యేటా లక్షఎకరాల భూమి పంచుతామని కూడా ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
