రాజీవ్యువశక్తి బ్యాంకర్ల యువశక్తా?:నోముల
హైదరాబాద్:రాజీవ్ యువశక్తి బ్యాంకర్లయువశక్తిగా మారిందని సిపియంపక్ష నాయకుడు నోముల నర్సింహయ్యవ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికిధన్యవాదాలు తెలిపే తీర్మానంపైశాసససభలో ఆయన గురువారంమాట్లాడారు. బ్యాంకర్లు చెప్పినట్లేఅంతా చేస్తున్నారని, రాజీవ్ యువశక్తిపథకంపై ప్రభుత్వానికి పట్టులేకుండాపోయిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోనిఇంజనీరింగ్ కళాశాలల తీరుపై ఆయనతీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలోఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లాపుట్టుకొచ్చాయని, అవి ప్రమాణాలు పాటించడంలేదని, వాటిలో కనీస వసతులు లేవనిఆయన అన్నారు. ఈ కళాశాలల నుంచి వచ్చేఇంజనీరింగ్ విద్యార్థుల తెలివితేటలు ఏమేరకు ఉంటాయో అర్థంచేసుకోవచ్చునని, ఇటువంటి విద్యార్థులుబయటకు వస్తే మన పరువుపోతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోనిప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిపై ఆయనఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్బోర్డర్కు రోజుకు ఏడు, తొమ్మిదిరూపాయలేసి ఇస్తున్నారని, ఆ డబ్బులతోరోజుకు మూడు పూటలా సరైన తిండిఅందించడం ఎలా సాధ్యమవుతుందనిఆయన అన్నారు. హాస్టల్ విద్యార్థుల పరిస్థితిదయనీయంగా ఉందని ఆయన అన్నారు.