టెలిఫోన్ ద్వారారైలు టికెట్ బుకింగ్ సదుపాయం
న్యూఢిల్లీ:ఈ ఏడాది పాట్నాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించినకంప్యూటరైజ్డ్ రైల్వే ఎంక్వైరీసేవలనుదేశవ్యాప్తంగా విస్తరిస్తామని శనివారంలోక్సభలో రైల్వేబడ్జెట్ సమర్పణసందర్భంగా రైల్వేమంత్రి లాలూ ప్రసాద్యాదవ్ప్రకటించారు. ఇంటర్నెట్ ద్వారా టికెట్లురిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని సెల్ ఫోన్లవినియోగదారులకు విస్తరించినవిధంగా ల్యాండ్లైన్ వినియోగదారులకుకూడా కల్పిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటివరకూఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదింటివరకు మాత్రమే ఉన్న ఇంటర్నెట్ బుకింగ్సౌకర్యాన్నిఈ ఏడాది మార్చి 15 నుంచి ఉదయం నాలుగున్నరనుంచి రాత్రి పదకొండున్నర దాకా పొడిగించారు.ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థలో పలుమార్పులు చేపట్టామని రిజర్వేషన్ చార్ట్లతోపాటు ఖాళీ సీట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడుతెలియజేసే చార్ట్లను ప్లాట్ఫారాల్లోప్రదర్శిస్తామనిఅన్నారు. సీజన్ టిక్కెట్లను ఇంటర్నెట్ ద్వారాపునర్నవీకరించే సదుపాయాన్ని ముంబయిసబర్బన్ ప్రయాణికులకు పైలట్ స్కీమ్గాప్రవేశపెట్టారు.