వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాలూ బడ్జెట్కువైఎస్ ప్రశంసలు
హైదరాబాద్:లాలూప్రసాద్ యాదవ్ రైల్వే బడ్జెట్నుముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్రాజశేఖరరెడ్డి ప్రసంశించారు. గత ఏడాది రైల్వేబడ్జెట్ కంటే ఇది మెరుగైనదని ఆయనశనివారం సాయంత్రం ఇక్కడ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలోవైఎస్పై వ్యంగ్యంగా రైల్వే మంత్రిలాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించిన విషయాన్నివిలేకరులు ప్రస్తావించగావైఎస్ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు.రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి గతంలోచేసినప్రకటనపై మాట మార్చుకున్నారు. తానునిర్ధిష్టంగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంప్రస్తావించలేదని, ఆ అంశాన్ని పరిశీలిస్తాననిమాత్రమే చెప్పాననిఆయన అన్నారు. లాలూ బడ్జెట్ వల్లరాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనితెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది.
Comments
Story first published: Saturday, February 26, 2005, 23:53 [IST]