సోనియా పర్యటనబహిష్కరణకు మావోయిస్టుల పిలుపు
న్యూఢిల్లీ:శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్గాంధీ పేరుపెట్టాలని వై. ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై బిజెపి, తెలుగుదేశం,ఇతర మిత్రపక్షాలు లోక్సభ నుంచివాకౌట్ చేశాయి. జీరో అవర్లో ఈ అంశాన్నిలేవనెత్తిన టిడిపి సభ్యుడు కె. యెర్రన్నాయుడుతెలుగువాడి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారనివిమర్శించారు. విమానాశ్రయానికితెలుగు ప్రజల అభిమాన నాయకుడు ఎన్.టి.రామారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.బిజెపి ఉపాధ్యక్షుడు వి. కె. మల్హోత్రా, అనంత్కుమార్ఈ చర్యను ఖండించారు. రక్షణమంత్రిప్రణబ్ ముఖర్జీ సమాధానమిస్తూ హైదరాబాద్విమానాశ్రయానికి రాజీవ్గాంధీ పేరుపెట్టిన ట్లు చెప్పారు. దేశీయ టెర్మినల్కుఎన్. టి. ఆర్ పేరు పెట్టినట్టు పేర్కొన్నారు.ప్రభుత్వ సమాధానంతో సంతృప్తిచెందనిటిడిపి నేతలు ముందుగా సభ నుంచివాకౌట్ చేశారు. ఆ తరువాత బిజెపి, ఇతరప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.