ఎయిర్పోర్టుకురాజీవ్ పేరే సబబు: వైఎస్
హైదరాబాద్:రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటే బేగంపేటలో ఉన్నడొమెస్టిక్ ఎయిర్పోర్టుకు ఎన్టీరామారావు పేరు పెట్టడానికి తమకుఅభ్యంతరం లేదని ముఖ్యమంత్రిడాక్టర్ రాజశేఖరరెడ్డి అన్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు 1992లోరాజీవ్గాంధీ పేరు పెట్టగా 1999లో ఎన్డీయేప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశంప్రభుత్వం ఒత్తిడి మేరకుహైదరాబాద్ ఎయిర్పోర్టుగా నామకరణంచేశారని వైఎస్ మంగళవారం ఇక్కడ విలేకరులసమావేశంలో చెప్పారు. అప్పుడేహైదరాబాద్ ఎయిర్పోర్టులోనిఇంటర్నేషనల్ టెర్మినల్కు రాజీవ్గాంధీ పేరును, డొమెస్టిక్టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును పెట్టారనిఆయన గుర్తు చేశారు. శంషాబాద్లోనిర్మాణమవుతున్న అంతర్జాతీయవిమానాశ్రయానికి రాజీవ్గాంధీ పేరుపెట్టాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామని,దీనిపై తెలుగుదేశం నాయకులురాద్దాంతం చేయడం విడ్డూరంగాఉందని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ పేరునుకొత్త ఎయిర్పోర్టుకు పెట్టడం సమంజసంగా ఉంటుందని వైఎస్అభిప్రాయపడ్డారు.