వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రనేతయాదన్న సహా నలుగురు మావోయిస్టులకాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వరంగల్‌ జిల్లా వెంకటాపురంమండలం అందుగులమేది అడవుల్లోశనివారం తెల్లవారుజామున పోలీసులుజరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులుమరణించారు. పోలీసులు ఎన్‌కౌంటర్‌గాచెబుతున్న ఈ కాల్పుల్లో వరంగల్‌,ఖమ్మం జిల్లాల మావోయిస్టు పార్టీ కార్యదర్శియాదన్న మృతి చెందాడు. మృతుల్లోయాదన్న రెండో భార్య లతక్క కూడాఉండవచ్చని భావిస్తున్నారు. 2000సంవత్సరంలో హన్మకొండ పోలీసుస్టేషన్‌ పేల్చివేతలో యాదన్నపాల్గొన్నాడు. యాదన్న తలపై మూడులక్షల రివార్డు ఉంది. పీపుల్స్‌ వార్‌ అగ్రనాయకుల్లో ఒకరైన యాదన్నమరణించడంతో వరంగల్‌ జిల్లాపోలీసులు ఆనందంతో బాణాసంచా కాల్చారు.యాదన్న మొత్తం పధేనుఎన్‌కౌంటర్ల నుంచితప్పించుకున్నాడు. నిషేధంఎత్తివేసిన తర్వాత మూడుఎన్‌కౌంటర్ల నుంచి అతను బతికిబయటపడ్డాడు. యాదన్న 1988 నుంచి అండర్‌గ్రౌడులో ఉంటున్నాడు. ఆయన మొదటిభార్య కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించింది.వరంగ ల్‌ జిల్లాలో పనిచేసిన ప్రతి ఎస్పీకియాదన్న ప్రధాన టార్గెట్‌గాఉండేవాడు. మావోయిస్టు అగ్రనేతయాదన్న మరణం పర్యవసానంగామావోయిస్టుల ప్రతీకార దాడులు ఉంటాయనిభావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఒంటరిగాసంచరించవద్దని పోలీసు సిబ్బందినికోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X