ముగ్గురుమహిళా మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్:విజయనగరం జిల్లాపార్వతీపురం డివిజన్లోని కురుపాం మండలానికిచెందిన ముగ్గురు మహిళా మావోయిస్టులుఆదివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోజిల్లా పోలీసు సూపరింటెండెంట్ స్వాతిలక్రామాట్లాడుతూ, వీరు ముగ్గురు కొండబారిడిఏరియా కమిటీకి చెందిన దళ సభ్యులని ఆమెతెలిపారు. కురుపాం మండలంలోని చాపరాయిగుడగ్రామానికి చెందిన కొండగొర్రి సింగమ్మి ఎలియాస్చిన్న, బిడ్డిక సుజాత(19), నోండ్రగండ గ్రామానికిచెందిన ఆరిక చిన్నమ్మి(18) లు లొంగిపోయినట్లుతెలిపారు. సింగమ్మి గత పది నెలలుగాదళంలో పనిచేస్తున్నదని, అన్ని రకాల ఆయుధాలుఉపయోగించడంలో శిక్షణ పొందిందనితెలిపారు. సుజాత కూడా అన్ని రకాల ఆయుధాలనుఉపయోగించడంలో శిక్షణ పొందిందని, గతఆరు నెలలుగా ఆమె దళంలో పనిచేస్తున్నట్లుఎస్పి వివరించారు. ఆరిక చిన్నమ్మి మూడునెలల నుంచి దేరువాడ ఎల్జిఎస్లో పనిచేస్తుందనితెలిపారు. లొంగిపోయిన వీరిపైన ఎటువంటికేసులూ పెట్టలేదని అన్నారు. వీరికి పునరావాససహాయార్ధం తక్షణమే జిల్లా కలెక్టర్నుంచి 5000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్నిఅందజేయనున్నట్టు చెప్పారు.