హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో బాంబు పేలుడు
హైదరాబాద్: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో రైల్వై ట్రాక్కు సమీపంలో బాంబు పేలిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ బాంబు పేలింది. బాంబు పేలిన స్థలం వంతెనకు పది, పదిహేను అడుగల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ సంఘటనలో ప్రాణాపాయమేదీ సంభవించలేదు. ఒక మేక బాంబు పేలుడులో చనిపోయింది.
మేక ఆ ప్రాంతంలో మేత కోసం సంచరిస్తుండగా బాంబు పేలినట్లు స్థానికులు చెప్పారు. మేక తునాతునకలైంది. బాంబు పేలుడు శబ్దం విన్న పక్కనే ఉన్న బస్తీకి చెందినవారు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై పోలీసులు అన్ని కోణాల నుంచి పరిశీలన జరుపుతున్నారు. ఈ సంఘటనకు కారకులెవరు, కారణమేమటనే విషయాలు తెలియడం లేదు.












Click it and Unblock the Notifications