వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ను ఎదుర్కోవడానికి కొత్త ఆయుధాలు: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారిని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అరెస్టులు చేయిస్తోందని తెలుగుదేశం శాసనసభ్యుడు అయన్నపాత్రుడు, పయ్యావుల కేశవ్‌, డి. నరేంద్ర, తదితరులు విమర్శించారు. ప్రజాపథం సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రయత్నించినవారిపై నిర్బంధం విధిస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అక్రమం అరెస్టులు చేస్తున్నారని వారు గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథం కార్యమ్రంపై వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రులు, శాసనసభ్యులు ప్రజాపథం కార్యక్రమం సందర్భంగా రౌడీషీటర్లను వెనకేసుకుని తిరుగుతున్నారని వారన్నారు. తమ శాసనసభ్యుడు నానీపై ఒక రౌడీ షీటర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు పెట్టారని, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే నానిపై ఆ కేసు బనాయించారని వారన్నారు. ప్రజా సమస్యలను వినడానికి కాంగ్రెస్‌ వారు భయపడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. ప్రజా పథం కార్యక్రమం సందర్భంగా మంత్రులు మార్కెట్‌ యార్డులను ఎందుకు సందర్శించడం లేదని వారడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X