నక్సల్స్పై నిషేధం ఆలోచన ఇప్పుడు లేదు: జానా
హైదరాబాద్: నక్సలైట్లపై నిషేధం విధించే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హోం మంత్రి కె. జానారెడ్డితోనూ, అధికారులతోనూ గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నక్సలైట్లపై నిషేధం విధించే విషయం ఇప్పుడైతే పరిశీలనలో లేదని జానారెడ్డి అన్నారు.
నక్సలైట్లపై రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ఆయన గురువారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకున్నారు. పోలీసు ఆధునీకీకరించడానికి నిధులు ఇవ్వాలని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు జానారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగే సమావేశంలో తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు. నక్సలైట్లపై నిషేధించాన్ని విధించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని తమ ఆలోచన ఇప్పుడు లేదని ఆయన అన్నారు.