వైజాగ్లో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి: సిఎం
విశాఖపట్నం:విశాఖపట్నంలోనికింగ్జార్జ్ ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధిచేసి సరికొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రినినిర్మించాలని తలపెట్టినట్లు ముఖ్యమంత్రివై ఎస్ రాజశేఖర్ రెడ్డి బుధవారం ప్రకటించారు.దీనికి రూ. 20కోట్లు వ్యయం అవుతుందని అన్నారు.విశాఖపట్నం జర్నలిస్టుల సమాఖ్య ఏర్పాటు చేసినమీట్ది ప్రెస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రిమాట్లాడారు. సరికొత్త ఆసుపత్రి పేదలకుఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అలాగే ప్రధానపరిశ్రమలను నెలకొల్పటానికి వీలుగా విశాఖపట్నం,కాకినాడల మధ్య కోస్టల్ కారిడార్నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. అవసరమైతేకారిడార్ను శ్రీకాకుళం వరకూ విస్తరిస్తామనిఅన్నారు. వచ్చే ఐదేళ్లలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి నేరుగా15 వేల కోట్ల రూపాయలు తరలివస్తాయనిఆశిస్తున్నట్లు చెప్పారు. నక్సల్స్ బెడదనుఎదుర్కోవటానికి కొత్త చట్టాలను రూపొందించాల్సినఅవసరం లేదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications