వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా పౌరసత్వంపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పౌరసత్వం మంజూరును సవాల్ చేస్తూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. స్వామి ఇంతకు ముందు దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజనాల వాజ్యాలను గత నెల కోర్టు కొట్టేసింది.
పిటిషన్పై పీస్మీల్ పద్ధతిలో వాదించకూడదని అంటూ ఛీఫ్ జస్టిస్ బి.సి. పటేల్, జస్టిస్ ఎస్.కె. కౌల్లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్ను కొట్టేసింది. హైకోర్టు పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సుబ్రహ్మణ్యం స్వామి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Story first published: Wednesday, May 18, 2005, 23:53 [IST]