ప్రపంచబ్యాంక్ అప్పులకు వైయస్ పాకులాట: టిడిపి
హైదరాబాద్: ప్రపంచ బ్యాంక్ రుణాను తీసుకోవద్దని చెప్పిన కాంగ్రెస్ తాను అధికారంలోకి రాగానే అప్పుల కోసం ప్రపంచబ్యాంక్ వెంట పడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు, డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి విమర్శించారు. ప్రపంచబ్యాంక్ను సంతృప్తి పరిచే చర్యలకు వైయస్ ప్రభుత్వం తంటాలు పడుతోందని వారు బుధవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
ప్రపంచ బ్యాంక్ రుణాల విషయంలో వాస్తవాలను వెల్లడించాలని, ప్రపంచ బ్యాంక్తో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏడాది కాలంలో ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదని వారు విమర్శించారు. ఇలాగే తీసుకుంటే పోతే రాష్ట్రం అప్పులు 2007-08 నాటికి లక్ష కోట్ల రూపాయలు దాటుతాయని వారు చెప్పారు. రుణాల విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సత్యదూరమైన మాటలు చెబుతున్నారని వారన్నారు. ప్రపంచ బ్యాంక్ ఉన్నతాధికారి రమాకాంత్ రెడ్డి జరిపిన ఉత్తరప్రత్తురాలను బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు.