వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కారు డ్రైవ్చేస్తూ ఇద్దరిని ఢీకొట్టిన చిరంజీవి కుమారుడు
హైదరాబాద్:హీరో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజశనివారం మధ్యాహ్నంకారు నడుపుతూ ఇద్దరుసైక్లిస్టులను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలోగాయపడిన వారిని ఆయన స్వయంగాఅపోలో ఆస్పత్రిలో చేర్పించాడు. రామ్ చరణ్బంజారాహిల్స్లో బసవరామతారకంకేన్సర్ ఆస్పత్రి సమీపంలో కారు నడుపుకుంటూవెళ్తుండగా కారుఅదుపు తప్పి సైకిల్ మీదవెళ్ళున్న వారిని ఢీకొట్టింది.సైక్లిస్టులను తప్పించడానికి కారునుఫుట్పాత్ వైపు తిప్పడంతో కారు ముందుభాగం దెబ్బతింది. గాయపడిన ఇద్దరుసైక్లిస్టులకు ప్రాణాపాయం లేదనివైద్యులు చెప్పారు. దీనిని యాక్సిడెంట్ కేసుగానమోదు చేసిరామ్చరణ్ను అరెస్టు చేసి, బెయిల్పై విడుదలచేశామనిబంజారాహిల్స్ పోలీసు అసిస్టెంట్కమిషనర్ మురళీధరరావు చెప్పారు.చిరంజీవి కుమారుడైనంత మాత్రానమెతకగావ్యవహరించడం లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని ఆయనతెలిపారు.
Story first published: Saturday, May 28, 2005, 23:53 [IST]